Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:07 PM

జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం

జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం

జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం
April 13, 2026 12:37 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగాపూర్ గ్రామంలో రాయికోడ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు పాల్గొని తమ అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు గ్రామస్తులతో పంచుకున్నారు. వారి మాటలు ప్రజలను ఆలోచింపజేసి రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం, అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి, జాగ్రత్తగా వాహనం నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగితే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువత, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News