జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం
జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం
Krishna
రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగాపూర్ గ్రామంలో రాయికోడ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు పాల్గొని తమ అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు గ్రామస్తులతో పంచుకున్నారు. వారి మాటలు ప్రజలను ఆలోచింపజేసి రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం, అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ మరియు సీట్బెల్ట్ వినియోగం లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి, జాగ్రత్తగా వాహనం నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగితే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువత, మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి