Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:52 PM

ఇంటికి వెళ్లే దారి మూసివేత… న్యాయం కోసం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించిన పరశురాం

ఇంటికి వెళ్లే దారి మూసివేత… న్యాయం కోసం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించిన పరశురాం

ఇంటికి వెళ్లే దారి మూసివేత… న్యాయం కోసం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించిన పరశురాం
March 12, 2026 10:13 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అధికారులు తన ఇంటికి వెళ్లే రహదారి సమస్యను పరిష్కరించకపోతే ఉరితాడే శరణ్యమని గ్రామస్తుడు పరశురాం ఆవేదన వ్యక్తం చేశారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం జ్యోవాలా తాండ గ్రామ పరిధిలో ఈ సమస్య నెలకొంది.బీమార్మి సంఘం అధ్యక్షులు అనుముల తుకారం ఆధ్వర్యంలో పరశురాం తరఫున సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జ్యోవాలా తాండ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 42లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, పరశురాం ఇంటికి వెళ్లేందుకు సరైన రహదారి కల్పించాలని వారు అధికారులను కోరారు.ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ తాను గతంలో పలుమార్లు మండల అభివృద్ధి అధికారి మరియు గ్రామ సెక్రటరీలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.సుమారు 35 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజల రాకపోకల సౌకర్యం కోసం 18 మీటర్ల వెడల్పుతో పంచాయతీ రహదారి కోసం భూమిని వదిలి పెట్టారని గ్రామస్తులు తెలిపారు. అయితే మాజీ సర్పంచ్ చరణ్ నాయక్ ఆ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఇప్పటికే రహదారి భూమిలో సుమారు 10.5 మీటర్ల వరకు ఆక్రమణ జరిగిందని వారు తెలిపారు.ఈ అక్రమ నిర్మాణాల వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పరశురాం ఇంటికి వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే రహదారిని ఆక్రమించడం సరైన చర్య కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీమార్మి సంఘం అధ్యక్షులు అనుముల తుకారం డిమాండ్ చేశారు. పరశురాం ఇంటికి వెళ్లే దారిని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ, లేనిపక్షంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష చేపడతామని హెచ్చరించారు.అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News