Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 12:18 AM

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
March 17, 2026 05:49 AM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని రెహమాన్ కార్యక్రమ మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమ హారతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.రంజాన్ మాసం పరస్పర గౌరవం, సోదరభావం, సఖ్యతను పెంపొందించే పవిత్రమైన కాలమని తెలిపారు.ఈ పవిత్రమైన రంజాన్ మాసం ప్రజల మధ్య ఐక్యతను బలపరచాలని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొనాలని ఆకాంక్షించారు. మత భేదాలు లేకుండా హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా జీవిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. రంజాన్ పండుగ అందరికీ శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News