Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 01:18 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ
March 11, 2026 07:23 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన మహిళా దినోత్సవ భావం “ఇవ్వడం ద్వారా అభివృద్ధి” అనే సందేశంతో నిర్వహించబడింది.మహిళలు సమాజ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళల సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహిళలకు గౌరవం, భద్రత మరియు సమాన హక్కులు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు న్యాయమూర్తులు మరియు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. భవాని చంద్ర, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. జయంతి, జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి కృష్ణార్జున, ఫోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీలేఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, ప్రధాన జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఆర్. అనిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కె. ధనలక్ష్మి పాల్గొన్నారు.అదేవిధంగా కోర్టు మహిళా సిబ్బంది,కోర్టు అధికారులు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. మహిళల అభివృద్ధి, సమానత్వం మరియు సాధికారతకు అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News