Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:11 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ
11-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన మహిళా దినోత్సవ భావం “ఇవ్వడం ద్వారా అభివృద్ధి” అనే సందేశంతో నిర్వహించబడింది.మహిళలు సమాజ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళల సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహిళలకు గౌరవం, భద్రత మరియు సమాన హక్కులు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు న్యాయమూర్తులు మరియు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. భవాని చంద్ర, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. జయంతి, జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి కృష్ణార్జున, ఫోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీలేఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, ప్రధాన జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఆర్. అనిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కె. ధనలక్ష్మి పాల్గొన్నారు.అదేవిధంగా కోర్టు మహిళా సిబ్బంది,కోర్టు అధికారులు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. మహిళల అభివృద్ధి, సమానత్వం మరియు సాధికారతకు అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Sthanikam

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ

Article Image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన మహిళా దినోత్సవ భావం “ఇవ్వడం ద్వారా అభివృద్ధి” అనే సందేశంతో నిర్వహించబడింది.మహిళలు సమాజ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళల సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహిళలకు గౌరవం, భద్రత మరియు సమాన హక్కులు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు న్యాయమూర్తులు మరియు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. భవాని చంద్ర, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. జయంతి, జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి కృష్ణార్జున, ఫోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీలేఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, ప్రధాన జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఆర్. అనిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కె. ధనలక్ష్మి పాల్గొన్నారు.అదేవిధంగా కోర్టు మహిళా సిబ్బంది,కోర్టు అధికారులు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. మహిళల అభివృద్ధి, సమానత్వం మరియు సాధికారతకు అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News