ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: హౌసింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: హౌసింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు ఆలస్యం లేకుండా అందేలా చూడాలని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హౌసింగ్ అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల హౌసింగ్ ఏఈలు, డిఈలు మరియు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను తక్షణమే క్లియర్ చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూసి బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ హౌసింగ్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి