హోలీ పండుగ సందర్భంలో దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న:ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
హోలీ పండుగ సందర్భంలో దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న:ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ ఆలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఖేడ్ శాసనసభ్యుడు పట్లోల సంజీవరెడ్డి భక్తిశ్రద్ధలతో దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. హోలీ పండుగ సందర్భంలో ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ ప్రధాన అర్చకుడు సాయి స్వామి ప్రత్యేక పూజలు, అర్చన, మంగళహారతి నిర్వహించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువా సమర్పించి ఘనంగా సన్మానించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, హోలీ పండుగ సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందకరమని, భక్తులకు శాంతి, సుఖసంతోషాలు కలగాలని, నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కలగాలని స్వామివారికి ప్రార్థించినట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భగవద్గీత పారాయణులు దత్తప్ప సౌకరి, మహాశెట్టి కాశీనాథ్ పటేల్, ముత్యాల మహేష్ కుమార్ (ఉపాధ్యాయుడు), మహాశెట్టి శివలింగ పాటిల్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మయ్య, వడ్ల జ్ఞానేశ్వర్, మనోహర్, నర్సప్ప (ఉపాధ్యాయుడు), సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి