హోలీ జాతర మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి సందడి
హోలీ జాతర మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి సందడి
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండల పరిధిలో ఉన్న మీట్య నాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన కాలు మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ పండగ జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాలు మహారాజ్ ఆశీస్సులు స్వీకరించారు. జాతరకు విచ్చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు కాపాడే ఇటువంటి జాతరలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు.కాలు మహారాజ్ పట్లోల చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించి గౌరవించారు. అనంతరం ప్రజలతో కలిసిమెలిసి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నెహ్రు నాయక్, నర్సింగ్ సర్పంచ్, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, బీ రాజు కౌన్సిలర్, ప్రకాష్ రాథోడ్ జిల్లా దిశా కమిటీ సభ్యుడు, కిషన్ రాథోడ్, రవీందర్ నాయక్ మాజీ జడ్పీటీసీ, సురేష్, విష్ణు రాథోడ్, దేవిదాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి