హెడ్ కానిస్టేబుల్ మరణం పోలీసు శాఖకు తీరని లోటు: ఎస్పీ
హెడ్ కానిస్టేబుల్ మరణం పోలీసు శాఖకు తీరని లోటు: ఎస్పీ
Krishna
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు అంత్యక్రియలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ నారాయణఖేడ్ పట్టణంలో హాజరై మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధను పంచుకుని అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వెంకటరాములకు రావలసిన అన్ని రకాల సేవా ప్రయోజనాలు మరియు ఆర్థిక సహాయాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వెంకటరాములు ఈ నెల 23న నారాయణఖేడ్ నుండి జహీరాబాద్కు బైక్పై వెళ్తుండగా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం కొండాపూర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. వెంకటరాములు మరణం జిల్లా పోలీసు శాఖకు తీరని లోటని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్, నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి