Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్ వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 10:17 PM

హ్యూమన్ రైట్స్ సేవలు ప్రజలకు చేరాలి – నాయకుల అభిప్రాయం

హ్యూమన్ రైట్స్ సేవలు ప్రజలకు చేరాలి – నాయకుల అభిప్రాయం

హ్యూమన్ రైట్స్ సేవలు ప్రజలకు చేరాలి – నాయకుల అభిప్రాయం
April 14, 2026 06:33 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలో అవార్డు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, విశిష్ట అతిథిగా పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి లేగా రామ్మోహన్ రెడ్డి, గౌరవ అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం జిల్లాస్థాయి, డివిజన్ స్థాయిలో ఎంపిక చేసిన మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు, యూనియన్ నాయకులు, తాపీ మేస్త్రీలు మరియు పలు రంగాల్లో సేవలందిస్తున్న వారిని అవార్డులతో సన్మానించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి, లేగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరింతగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. హ్యూమన్ రైట్స్ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ నాయకుడు బట్టు శీనన్న హ్యూమన్ రైట్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరగా, డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ పేదల కోసం సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలతో పాటు సామాజిక సంఘాలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర, డివిజన్,మండల స్థాయి నాయకులు మరియు సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News