హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
స్థానికం బృందం
హయత్ నగర్, హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం సమాజ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. సైన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష మార్పులు చోటుచేసుకున్నాయని, విద్యార్థులు పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు.
డాక్టర్ అవేస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం యువతలో ఆవిష్కరణాత్మక దృక్పథాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు. 2026 థీమ్ ‘సైన్స్లో మహిళలు – వికసిత భారత్కు శక్తి’ ప్రస్తుత కాలానికి ఎంతో ప్రాముఖ్యమైందని అన్నారు.
ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధు ధర్మపురి మాట్లాడుతూ C. V. Raman ఆవిష్కరించిన రామన్ ప్రభావం భారత శాస్త్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువచ్చిందని వివరించారు. కాంతి వ్యాప్తిపై చేసిన పరిశోధనలు శాస్త్ర లోకానికి మార్గదర్శకమయ్యాయని పేర్కొన్నారు.
డాక్టర్ డి. బాల నరసింహ సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులను వివరించగా, డాక్టర్ వి. శేఖర్ సైన్స్ లేకుండా సమాజ అభివృద్ధి అసాధ్యమని స్పష్టం చేశారు. డాక్టర్ ఎ. దుర్గా ప్రసాద్ రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బి. సుభాషిణి, కె. ఉమారాణి, ఎ. రజిత, బి. మమతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ శాస్త్రీయ అంశాలపై చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి