Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:56 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
March 16, 2026 08:19 PM 295 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల పరిధిలో సోమవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ గ్రామం నుంచి నల్లంపల్లి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల లేదా వాహనం నియంత్రణ కోల్పోయి స్వయంగా స్కిడ్ కావడం వల్ల ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతని వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని,గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేదా వాహనం జారి పడటం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News