గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Sthanikam joint District Staff Reporter krishna
అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల పరిధిలో సోమవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ గ్రామం నుంచి నల్లంపల్లి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల లేదా వాహనం నియంత్రణ కోల్పోయి స్వయంగా స్కిడ్ కావడం వల్ల ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతని వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని,గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేదా వాహనం జారి పడటం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి