Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 11:02 PM

ఘనంగా విశాల భారతి హైస్కూల్ 35వ వార్షికోత్సవం

ఘనంగా విశాల భారతి హైస్కూల్ 35వ వార్షికోత్సవం

ఘనంగా విశాల భారతి హైస్కూల్ 35వ వార్షికోత్సవం
March 02, 2026 09:23 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు

కె. నరేష్ కుమార్

ఇండియన్ స్పీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)

చౌటుప్పల్ మండల కేంద్రంలోని విశాల భారతి స్కూల్ 35 వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వివిధ అంశాలపై రూపొందించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, అతిథులు హర్షాతిరేకాలతో అభినందించారు. ముఖ్యఅతిథిగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కె నరేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ..విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోడెల ఆంజనేయులు , అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News