ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు
ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు నిర్వహించే ఈ జాతరలో భాగంగా మొదటి గురువారం సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజీ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య, ప్రధాన అర్చకులు మరియు ఎక్స్ ఆఫీసియో సభ్యుడు శ్రీకాంత్ స్వామి, అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం కమిటీ సభ్యులు,మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, దిలీప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ జాతర ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో కొనసాగుతూ ఈసారి కూడా భారీగా భక్తులను ఆకర్షించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి