Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:17 AM

ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు

ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు

ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు
23-04-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna


నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు నిర్వహించే ఈ జాతరలో భాగంగా మొదటి గురువారం సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజీ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య, ప్రధాన అర్చకులు మరియు ఎక్స్ ఆఫీసియో సభ్యుడు శ్రీకాంత్ స్వామి, అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం కమిటీ సభ్యులు,మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, దిలీప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ జాతర ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో కొనసాగుతూ ఈసారి కూడా భారీగా భక్తులను ఆకర్షించింది.

Sthanikam

ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు

Article Image


నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు నిర్వహించే ఈ జాతరలో భాగంగా మొదటి గురువారం సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజీ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య, ప్రధాన అర్చకులు మరియు ఎక్స్ ఆఫీసియో సభ్యుడు శ్రీకాంత్ స్వామి, అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం కమిటీ సభ్యులు,మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, దిలీప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ జాతర ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో కొనసాగుతూ ఈసారి కూడా భారీగా భక్తులను ఆకర్షించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News