Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 12:47 PM

ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం

ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం

ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం
March 01, 2026 05:45 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

అమరవీరుల త్యాగఫలమే వర్గీకరణ

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత చింతాబాబు మాదిగ

కోదాడ పట్టణంలోని గాంధీనగర్ హరిజనవాడలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ స్తూపం వద్ద అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షులు చింతాబాబు మాదిగ మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఫలితంగానే నేడు వర్గీకరణ సాధ్యమైందన్నారు. సాధించుకున్న వర్గీకరణను అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. వర్గీకరణ ఫలాలను అందిపుచ్చుకుని మాదిగ బిడ్డలు చదువు, ఉద్యోగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.రాష్ట్రంలో మాదిగలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే ఎవరైతే దాడులు పాల్పడుతున్నారొ వాళ్లని శిక్షించాలన్నారు.ఎమ్మార్పీఎస్ యువసేన జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు,జిల్లా కార్యదర్శి స్వామి, హరిజనవాడ పెద్దలు కుడుములు కోటేష్, మోతే మండల అధ్యక్షులు ఉప్పల వినోద్,యలమర్తి ఉపేందర్, బచ్చల కూరి విజయ్, కుడుముల గోపి,సోమపంగు విక్కీ,చింత వినయ్, కుడుముల నవీన్,కందుల జగదీష్,మిట్టగనపుల గోపి, కుడుముల వినయ్,జమ్ముల మసిన్ధరావు,చింతా రాహుల్ తదితరులు పాల్గొన్నారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News