ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం
ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం
Harish HS
అమరవీరుల త్యాగఫలమే వర్గీకరణ
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత చింతాబాబు మాదిగ
కోదాడ పట్టణంలోని గాంధీనగర్ హరిజనవాడలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ స్తూపం వద్ద అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షులు చింతాబాబు మాదిగ మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఫలితంగానే నేడు వర్గీకరణ సాధ్యమైందన్నారు. సాధించుకున్న వర్గీకరణను అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. వర్గీకరణ ఫలాలను అందిపుచ్చుకుని మాదిగ బిడ్డలు చదువు, ఉద్యోగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.రాష్ట్రంలో మాదిగలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే ఎవరైతే దాడులు పాల్పడుతున్నారొ వాళ్లని శిక్షించాలన్నారు.ఎమ్మార్పీఎస్ యువసేన జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు,జిల్లా కార్యదర్శి స్వామి, హరిజనవాడ పెద్దలు కుడుములు కోటేష్, మోతే మండల అధ్యక్షులు ఉప్పల వినోద్,యలమర్తి ఉపేందర్, బచ్చల కూరి విజయ్, కుడుముల గోపి,సోమపంగు విక్కీ,చింత వినయ్, కుడుముల నవీన్,కందుల జగదీష్,మిట్టగనపుల గోపి, కుడుముల వినయ్,జమ్ముల మసిన్ధరావు,చింతా రాహుల్ తదితరులు పాల్గొన్నారు......

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి