ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు
ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు
స్థానికం బృందం
హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ ఎంక్లేవ్ ఫేస్–1 కాలనీవాసులు తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిను ఘనంగా సన్మానించారు. గజమాల, శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు.
నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలే తనకు బలం అని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.
కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నగేష్, సంక్షేమ సంఘం సభ్యులు వెంకటేష్, రాజు, రవి, నర్సింగ్ రావు, జంగయ్య, రెడమ్మా తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి