Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు
01-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ ఎంక్లేవ్ ఫేస్–1 కాలనీవాసులు తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిను ఘనంగా సన్మానించారు. గజమాల, శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు.

నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలే తనకు బలం అని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నగేష్, సంక్షేమ సంఘం సభ్యులు వెంకటేష్, రాజు, రవి, నర్సింగ్ రావు, జంగయ్య, రెడమ్మా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు

Article Image

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ ఎంక్లేవ్ ఫేస్–1 కాలనీవాసులు తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిను ఘనంగా సన్మానించారు. గజమాల, శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు.

నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలే తనకు బలం అని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నగేష్, సంక్షేమ సంఘం సభ్యులు వెంకటేష్, రాజు, రవి, నర్సింగ్ రావు, జంగయ్య, రెడమ్మా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News