Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 02:52 AM

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు
March 01, 2026 05:58 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ ఎంక్లేవ్ ఫేస్–1 కాలనీవాసులు తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిను ఘనంగా సన్మానించారు. గజమాల, శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు.

నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలే తనకు బలం అని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నగేష్, సంక్షేమ సంఘం సభ్యులు వెంకటేష్, రాజు, రవి, నర్సింగ్ రావు, జంగయ్య, రెడమ్మా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News