Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 07:11 PM

గట్ లింగంపల్లి ఆయకట్టు మరమత్తుకు శంకుస్థాపన – రైతులకు భారీ లాభం

గట్ లింగంపల్లి ఆయకట్టు మరమత్తుకు శంకుస్థాపన – రైతులకు భారీ లాభం

గట్ లింగంపల్లి ఆయకట్టు మరమత్తుకు శంకుస్థాపన – రైతులకు భారీ లాభం
March 02, 2026 05:17 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని గట్ లింగంపల్లి వద్ద ఇరిగేషన్ శాఖ ద్వారా 48.7 లక్షల రూపాయలతో ఎడమ కాలువ 1.4 కిమీ, కుడి కాలువ 1.2 కిమీ పొడవు గల ఆయకట్టు మరమత్తు పనులకు శంకుస్థాపన చేశారు.నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి.ఎమ్మెల్యే తెలిపారు,ఈ ఆయకట్టు మరమత్తు ద్వారా 240 ఎకరాల పంటల సాగు 300 ఎకరాల వరకు పెరగనుందని, రైతులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని.గత ప్రభుత్వం గట్ లింగంపల్లి ప్రాజెక్టును అమలు చేస్తామని మాటలు చెప్పినా నిజంగా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, భోజిరెడ్డి – బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు,బ్రహ్మానంద్ రెడ్డి, శేరి రాజు – మాజీ సర్పంచ్‌లు, శ్రీకాంత్ రెడ్డి,దుధగోండ గ్రామ సర్పంచ్ చోద్ర లీలా,ఉప సర్పంచ్ ప్రతిభ అనిల్ పాటిల్,గ్రామ పెద్దలు దౌలత్ రావు పాటిల్,ధనరాజ్ పాటిల్,వార్డు సభ్యులు,మండల సమాఖ్య బోరంచ క్లస్టర్ సిసి హమ్మండ్ల, గ్రామ సమాఖ్య విఓఏ కవిత, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News