గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో ఘనంగా పదో తరగతి ఫేర్వెల్
గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో ఘనంగా పదో తరగతి ఫేర్వెల్
K.RAVI
చౌటుప్పల్ గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో పదో తరగతి విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఆనందం–ఆవేశాల మేళవింపుగా నిలిచింది. ముఖ్య అతిథులుగా దారావత్ సూర్యం (ఎస్బిఐ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షులు), జితేందర్ రెడ్డి (తెలంగాణ టీవీ కేబుల్ జేఏసీ ప్రెసిడెంట్) హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందించారు. “కష్టపడితే అసాధ్యం ఏదీ లేదు. లక్ష్యసాధనకు పట్టుదలతో ముందుకు సాగాలి” అని దారావత్ సూర్యం పేర్కొన్నారు. యువతే దేశ భవిష్యత్తని, నైతిక విలువలను పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని జితేందర్ రెడ్డి సూచించారు. అధ్యక్షత వహించిన వీణ అనీల్ రెడ్డి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో క్రమశిక్షణగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పాఠశాల డైరెక్టర్ లక్ష్మి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి విజయాలను పాఠశాల ఎల్లప్పుడూ గర్వంగా స్వాగతిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకోగా, ఉపాధ్యాయులు జ్ఞాపికలు అందజేసి ఆశీర్వదించారు. చివరగా విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి