గ్రహణం నేపథ్యంలో బోరంచ నల్లపోచమ్మ ఆలయం మూసివేత ప్రకటన
గ్రహణం నేపథ్యంలో బోరంచ నల్లపోచమ్మ ఆలయం మూసివేత ప్రకటన
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహక అధికారి శివరుద్రప్ప ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం ఏర్పడనున్న చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకం మరియు అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు.ఆ సమయం నుంచి గ్రహణం ముగిసే వరకు అమ్మవారికి సంబంధించిన అన్ని పూజా, సేవా కార్యక్రమాలను నిలిపివేస్తామని తెలిపారు.గ్రహణం ముగిసిన తరువాత మరుసటి రోజు బుధవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ఉదయం 8 గంటలకు భక్తులకు పునర్దర్శనం కల్పిస్తారు. ఆ తరువాత సాధారణంగా జరిగే పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.ఈ మార్పులను భక్తులు గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని శివరుద్రప్ప విజ్ఞప్తి చేశారు. గ్రహణం సందర్భంగా ఆలయ ఆచార సంప్రదాయాలను పాటించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి