గాంధి మార్గంలోనే ఉద్యమిస్తున్నాము - పూస శ్రీనివాస్
గాంధి మార్గంలోనే ఉద్యమిస్తున్నాము - పూస శ్రీనివాస్
Sthanikam District Staff Reporter
భువనగిరి టౌన్:తెలంగాణ ఉద్యమాన్ని అన్ని మార్గాల్లో చేసినామని, తెగించి కొట్లాడిన ఉద్యమకారులందరు నేడు గాంధి మార్గములోనే ఉద్యమిస్తున్నారని ఉద్యమకారులకు ఇచ్చిన హామిలు వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంగం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ కోరినారు. సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన “నిరసన దీక్ష"లో పాల్గొని మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ధర్నాలు,రైల్రోకోలు చేసినామని ఉద్యమకారులకు కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 చ.గజాల స్థలము, రూ॥ 30,000 పెన్షన్,ఆరోగ్య కార్డు ఇవ్వాలని అంతవరకు గాంధి మార్గములోనే మా ప్రయాణం ఉంటుందని రేవంత్రెడ్డి ఆలోచించి నిర్ణయిం తీసుకోవాలని సి.ఎం.విజ్ఞప్తి చేసినారు.ఈ కార్యక్రమంలో మెరుగు మధు,డి.ఎస్.మాణిక్యమ్మ,గొర్ల లక్ష్మణ్, గోపరాజు గణేష్, మంతపురం వినోద్కుమార్,సుధాకర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి