Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 01:15 AM

ఎస్సీ వర్గీకరణ అమరవీరులకు ఘన నివాళులు

ఎస్సీ వర్గీకరణ అమరవీరులకు ఘన నివాళులు

ఎస్సీ వర్గీకరణ అమరవీరులకు ఘన నివాళులు
March 01, 2026 08:26 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో మాదిగ సంస్మరణ దినోత్సవం

ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల కమిటీ అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరించాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ ఉద్యమం సందర్భంలో ప్రాణాలు అర్పించిన పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడి మృతి చెందిన భారతి మాదిగల త్యాగాలను స్మరించారు.వర్గీకరణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, మాదిగ దండోరా ఉద్యమంలో పాల్గొన్న వేలాది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేడి యాదయ్య, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఊదర వెంకటేష్ మహజన్, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు బోయ మల్లేష్, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు సుక్క అర్జున్ మాదిగ, సామాజిక ఉద్యమకారుడు కట్టెల లింగస్వామి, ఎం.జె.ఎఫ్ మండల అధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్, తాళ్ల సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ కిరణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాజ్ పేరియర్, విహెచ్‌పిఎస్ జిల్లా నాయకులు గడ్డం ప్రభాకర్, బద్రి గాలయ్య, బోయ సృజన్, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News