Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:13 AM

ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా

ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా

ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా
16-04-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎస్‌ఐఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు గౌస్ పాషా సూచించారు. కాన్వాన్ ఎమ్మెల్యే మొయినుద్దీన్ పర్యవేక్షణలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ హెల్ప్ డెస్క్ ప్రారంభించగా, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాల్లో ఉన్న పొరపాట్లు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చి సేవలను పొందవచ్చని, హెల్ప్ డెస్క్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్, వాజిద్, రియాజ్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా

Article Image

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎస్‌ఐఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు గౌస్ పాషా సూచించారు. కాన్వాన్ ఎమ్మెల్యే మొయినుద్దీన్ పర్యవేక్షణలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ హెల్ప్ డెస్క్ ప్రారంభించగా, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాల్లో ఉన్న పొరపాట్లు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చి సేవలను పొందవచ్చని, హెల్ప్ డెస్క్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్, వాజిద్, రియాజ్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News