సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎస్ఐఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు గౌస్ పాషా సూచించారు. కాన్వాన్ ఎమ్మెల్యే మొయినుద్దీన్ పర్యవేక్షణలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ హెల్ప్ డెస్క్ ప్రారంభించగా, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాల్లో ఉన్న పొరపాట్లు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చి సేవలను పొందవచ్చని, హెల్ప్ డెస్క్పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్, వాజిద్, రియాజ్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 07, 2026 01:13 AM
ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా
ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా
16-04-2026
102 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎస్ఐఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు గౌస్ పాషా సూచించారు. కాన్వాన్ ఎమ్మెల్యే మొయినుద్దీన్ పర్యవేక్షణలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ హెల్ప్ డెస్క్ ప్రారంభించగా, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాల్లో ఉన్న పొరపాట్లు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చి సేవలను పొందవచ్చని, హెల్ప్ డెస్క్పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్, వాజిద్, రియాజ్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి