Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 22, 2026 08:10 PM

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన భవాని

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన భవాని

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన భవాని
March 22, 2026 06:41 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో పెద్ద శంకరంపేట్ పట్టణానికి చెందిన మాజీ మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుసుల భవాని నరసింహాచారి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అవుసుల భవాని నరసింహాచారి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దేశానికి మరియు రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా సేవలందించిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అదే స్ఫూర్తితో తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఇకపై పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, గ్రామ స్థాయి నుంచి ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తూ, పార్టీ అభివృద్ధి మరియు ప్రజా సేవలను ముందుకు తీసుకెళ్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అవుసుల భవాని నరసింహాచారికి శుభాకాంక్షలు తెల

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News