Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:13 AM

ఎన్నికలకు సిద్ధం అవ్వండి… కాంగ్రెస్ నాయకుల పిలుపు

ఎన్నికలకు సిద్ధం అవ్వండి… కాంగ్రెస్ నాయకుల పిలుపు

ఎన్నికలకు సిద్ధం అవ్వండి… కాంగ్రెస్ నాయకుల పిలుపు
21-04-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, దిశ కమిటీ సభ్యులు ప్రకాష్ రాథోడ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజలతో సన్నిహితంగా ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలంగా నిలబెట్టాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సమావేశం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ రాబోయే రోజులకు దిశానిర్దేశం చేసిన కార్యక్రమంగా నిలిచింది.

Sthanikam

ఎన్నికలకు సిద్ధం అవ్వండి… కాంగ్రెస్ నాయకుల పిలుపు

Article Image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, దిశ కమిటీ సభ్యులు ప్రకాష్ రాథోడ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజలతో సన్నిహితంగా ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలంగా నిలబెట్టాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సమావేశం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ రాబోయే రోజులకు దిశానిర్దేశం చేసిన కార్యక్రమంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News