ఎన్నికలకు సిద్ధం అవ్వండి… కాంగ్రెస్ నాయకుల పిలుపు
ఎన్నికలకు సిద్ధం అవ్వండి… కాంగ్రెస్ నాయకుల పిలుపు
Krishna
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దిశ కమిటీ సభ్యులు ప్రకాష్ రాథోడ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజలతో సన్నిహితంగా ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలంగా నిలబెట్టాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సమావేశం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ రాబోయే రోజులకు దిశానిర్దేశం చేసిన కార్యక్రమంగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి