ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..
ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..
Krishna
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కంది, కొండాపూర్, సంగారెడ్డి పట్టణం,సంగారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.21,88,500 విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికంగా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే సహకారంతో ఈ సహాయం అందిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో సహాయం పరిమితంగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ మొత్తంలో అందించామని చెప్పారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ సహాయం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మామిళ్ళ రాజేందర్, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, కొండల్ రెడ్డి, విఠల్, చక్రపాణి, మల్లాగౌడ్, శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి