Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 08:16 PM

ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ బృందం

ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ బృందం

ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ బృందం
March 16, 2026 06:49 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna

సోమవారం మహబూబాబాద్ జిల్లా డివిజన్ కేంద్రంలో హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ నాయకత్వంలో సంస్థ ప్రతినిధులు స్థానిక ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్‌ఐ నజీమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి నెల చివరి రోజున సివిల్ రైట్స్ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు మరియు విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాటికి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు వివరించారు. ప్రజలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడం కూడా ఎంతో అవసరమని తెలిపారు.దీనిపై ఎమ్మార్వో శ్రీనివాస్ స్పందిస్తూ ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థుల కష్టసుఖాలు తెలుసుకొని వారికి అవసరమైన సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.దీనిపై ఎమ్మార్వో శ్రీనివాస్ స్పందిస్తూ ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థుల కష్టసుఖాలు తెలుసుకొని వారికి అవసరమైన సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.దీనిపై ఎమ్మార్వో శ్రీనివాస్ స్పందిస్తూ ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గొల్లపల్లి మహేష్, డివిజన్ కమిటీ సభ్యుడు రమేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News