Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:34 AM

ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం “నేను ఎవరో మీకు తెలుసా?” ఫ్లెక్సీతో నేరస్థులకు హెచ్చరిక

ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం “నేను ఎవరో మీకు తెలుసా?” ఫ్లెక్సీతో నేరస్థులకు హెచ్చరిక

ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం “నేను ఎవరో మీకు తెలుసా?” ఫ్లెక్సీతో నేరస్థులకు హెచ్చరిక
01-03-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు: నేరాల నియంత్రణలో కొత్తదనం చూపిస్తూ ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. “నేను ఎవరో మీకు తెలుసా?” అంటూ పాత నేరస్థుల ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో కట్టిన ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా శుభాకాంక్షలు, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యే ఫ్లెక్సీలను ఈసారి పోలీసులు ప్రజా భద్రత కోసం వినియోగించడం విశేషం. ఇళ్లలో దొంగతనాలు, బైక్ చోరీలు, గొలుసు దోపిడీలు, ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైర్లు దొంగిలించిన కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్థుల ఫోటోలు, పేర్లు, నివాస ప్రాంతాల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

“జర జాగ్రత్త… వీళ్లు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు” అనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ప్రచారంతో నేరస్థుల్లో భయం కలిగించడంతో పాటు, ప్రజల్లో జాగ్రత్త భావన పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు చెబుతున్నారు.

ఫ్లెక్సీని చూసిన స్థానికులు పోలీసుల ఆలోచనను అభినందిస్తున్నారు. “నేరాలను అరికట్టడంలో ఇది మంచి ముందడుగు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా స్థాయిలో కనిపిస్తున్న ఈ ప్రచారం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది.

Sthanikam

ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం “నేను ఎవరో మీకు తెలుసా?” ఫ్లెక్సీతో నేరస్థులకు హెచ్చరిక

Article Image

ఏలూరు: నేరాల నియంత్రణలో కొత్తదనం చూపిస్తూ ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. “నేను ఎవరో మీకు తెలుసా?” అంటూ పాత నేరస్థుల ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో కట్టిన ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా శుభాకాంక్షలు, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యే ఫ్లెక్సీలను ఈసారి పోలీసులు ప్రజా భద్రత కోసం వినియోగించడం విశేషం. ఇళ్లలో దొంగతనాలు, బైక్ చోరీలు, గొలుసు దోపిడీలు, ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైర్లు దొంగిలించిన కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్థుల ఫోటోలు, పేర్లు, నివాస ప్రాంతాల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

“జర జాగ్రత్త… వీళ్లు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు” అనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ప్రచారంతో నేరస్థుల్లో భయం కలిగించడంతో పాటు, ప్రజల్లో జాగ్రత్త భావన పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు చెబుతున్నారు.

ఫ్లెక్సీని చూసిన స్థానికులు పోలీసుల ఆలోచనను అభినందిస్తున్నారు. “నేరాలను అరికట్టడంలో ఇది మంచి ముందడుగు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా స్థాయిలో కనిపిస్తున్న ఈ ప్రచారం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News