Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 06:48 PM

ఏకగ్రీవ తీర్మానంతో మనూరు మండల సర్పంచుల ఫోరం కొత్త కమిటీ ఏర్పాటు

ఏకగ్రీవ తీర్మానంతో మనూరు మండల సర్పంచుల ఫోరం కొత్త కమిటీ ఏర్పాటు

ఏకగ్రీవ తీర్మానంతో మనూరు మండల సర్పంచుల ఫోరం కొత్త కమిటీ ఏర్పాటు
February 27, 2026 07:08 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూరు మండల పరిధిలోని గ్రామ సర్పంచుల సమక్షంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో దోసపల్లి గ్రామ సర్పంచ్ బిరాదర్ దత్తును మనూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఏకమత్యంతో తమ మద్దతు తెలియజేయడంతో ఈ ఎన్నికలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి.అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రాణపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా బెల్లాపూర్ సర్పంచ్ రేష దిగంబర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తుమ్ముర్ సర్పంచ్ సంజీవులు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా ముగుదంపూర్ సర్పంచ్ మోహన్ రెడ్డి మరియు బోరంచ గ్రామ సర్పంచ్ బీరప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రానాపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా బెల్లాపూర్ సర్పంచ్ రేష దిగంబర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తుమ్మునూరు సర్పంచ్ సంజీవులు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా ముగుదంపూర్ సర్పంచ్ మోహన్ రెడ్డి మరియు బోరంచ గ్రామ సర్పంచ్ బీరప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బిరాదర్ దత్తు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధి, గ్రామాల సమగ్ర పురోగతి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకుని సమిష్టిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.మనూరు మండలంలోని గ్రామాల మధ్య ఐక్యత, సమన్వయం పెంపొందించడమే లక్ష్యంగా సర్పంచుల ఫోరం పనిచేస్తుందని, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News