Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:13 PM

విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు

విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు

విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
April 21, 2026 03:45 PM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలోని పెద్దబాయి గల్లీలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ మృత్యుపాశాలుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ వీధిలో ప్రజలు, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండగా తీగలు చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని మండిపడుతూ వెంటనే స్పందించి ఈ ప్రమాదకర తీగలను సరిచేయాలని, పెను ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News