Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎం.డి. హాఫిజ్‌కు భౌతిక దేహానికి నివాళులర్పించిన సర్పంచ్ విక్రమ్ జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు! 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 05:20 PM

విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు

విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు

విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
April 21, 2026 03:45 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలోని పెద్దబాయి గల్లీలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ మృత్యుపాశాలుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ వీధిలో ప్రజలు, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండగా తీగలు చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని మండిపడుతూ వెంటనే స్పందించి ఈ ప్రమాదకర తీగలను సరిచేయాలని, పెను ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News