విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలోని పెద్దబాయి గల్లీలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ మృత్యుపాశాలుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ వీధిలో ప్రజలు, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండగా తీగలు చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని మండిపడుతూ వెంటనే స్పందించి ఈ ప్రమాదకర తీగలను సరిచేయాలని, పెను ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి