PRINT TIME: April 25, 2026 06:34 PM
విద్యుత్ సమస్యలపై ఏడీని కలిసిన సర్పంచ్ సంగమేష్ పటేల్
విద్యుత్ సమస్యలపై ఏడీని కలిసిన సర్పంచ్ సంగమేష్ పటేల్
April 25, 2026 05:07 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఉన్న విద్యుత్ ఏడీ కార్యాలయంలో తొర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్ మర్యాదపూర్వకంగా విద్యుత్ ఏడీని కలిసి గ్రామంలో నెలకొన్న పలు విద్యుత్ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్, లైన్ల మరమ్మతులు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరగా, విద్యుత్ ఏడీ స్పందిస్తూ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ పటేల్, మాజీ సర్పంచ్ పండరి పటేల్, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి