Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 10:05 AM

విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి..

విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి..

విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి..
February 28, 2026 07:52 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పరిశోధన రంగాల్లో రాణించి శాస్త్రవేత్తల ఆశయాలు సాధించాలి...

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కోదాడ బాలుర పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు...

విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పరిశోధన రంగాల్లో రాణించి శాస్త్రవేత్తల ఆశయాలను సాధించాలన్నారు.సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్ చైర్ పర్సన్ కు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుర్వావమ్మ సైదీ బాబు, ఉపాధ్యాయులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News