విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి..
విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి..
Harish HS
పరిశోధన రంగాల్లో రాణించి శాస్త్రవేత్తల ఆశయాలు సాధించాలి...
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కోదాడ బాలుర పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు...
విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పరిశోధన రంగాల్లో రాణించి శాస్త్రవేత్తల ఆశయాలను సాధించాలన్నారు.సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్ చైర్ పర్సన్ కు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుర్వావమ్మ సైదీ బాబు, ఉపాధ్యాయులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి