ఉరుమడ్లలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ
ఉరుమడ్ల గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులు, అధికారులు, అనధికారులు వంటి విభిన్న పాత్రలు ధరించి పాఠశాల పరిపాలనను స్వయంగా నిర్వహించడం విశేషం.
ప్రభాత వేళ పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తరగతి నాయకులు, కార్యదర్శులు వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. పాఠశాల వ్యవహారాలు, తరగతుల బోధన, హాజరు నమోదు వంటి పనులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ తమ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్ధన్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతాభావం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలుఎంతోదోహదపడతాయనిఅన్నారు.ప్రధానోపాధ్యాయులు ఆర్. వెంకన్న విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్లో వారు సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు బి. యాదయ్య కూడా విద్యార్థుల చొరవను అభినందించారు.
విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామస్థులు, తల్లిదండ్రులు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రశంసించారు.స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమన్వయం పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి