Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 08:44 PM

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం
February 28, 2026 07:23 PM 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

బోగారం, : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా అవగాహన పెంపొందించేందుకు మండల ప్రాథమికోన్నత పాఠశాల బోగారంలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అధికార హోదాలను చేపట్టి ప్రతీకాత్మకంగా బాధ్యతలు నిర్వర్తించారు.

కలెక్టర్గా మేడి ఉదయశ్రీ, జిల్లా విద్యాధికారిగా నేరటి వరుణ్, ఎంపీడీవోగా మేడి గౌతమి, మండల విద్యాశాఖ అధికారిగా చెరుకు జ్ఞాపక, సర్పంచ్‌గా మెట్టు అవినాష్, ప్రధానోపాధ్యాయురాలిగా మారం అనుపమ, విద్యా కమిటీ చైర్మన్‌గా కొక్కుల భావన వ్యవహరించారు. ఆయా హోదాల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులు ఆకట్టుకున్నారు.

ముగింపు కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్ వైకాని ఉమ, ఏఏపీసీ చైర్మన్ బాబు జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు బాధ్యతాభావాన్ని అలవాటు చేస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News