Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం
28-02-2026 177 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారం, : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా అవగాహన పెంపొందించేందుకు మండల ప్రాథమికోన్నత పాఠశాల బోగారంలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అధికార హోదాలను చేపట్టి ప్రతీకాత్మకంగా బాధ్యతలు నిర్వర్తించారు.

కలెక్టర్గా మేడి ఉదయశ్రీ, జిల్లా విద్యాధికారిగా నేరటి వరుణ్, ఎంపీడీవోగా మేడి గౌతమి, మండల విద్యాశాఖ అధికారిగా చెరుకు జ్ఞాపక, సర్పంచ్‌గా మెట్టు అవినాష్, ప్రధానోపాధ్యాయురాలిగా మారం అనుపమ, విద్యా కమిటీ చైర్మన్‌గా కొక్కుల భావన వ్యవహరించారు. ఆయా హోదాల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులు ఆకట్టుకున్నారు.

ముగింపు కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్ వైకాని ఉమ, ఏఏపీసీ చైర్మన్ బాబు జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు బాధ్యతాభావాన్ని అలవాటు చేస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

Article Image

బోగారం, : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా అవగాహన పెంపొందించేందుకు మండల ప్రాథమికోన్నత పాఠశాల బోగారంలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అధికార హోదాలను చేపట్టి ప్రతీకాత్మకంగా బాధ్యతలు నిర్వర్తించారు.

కలెక్టర్గా మేడి ఉదయశ్రీ, జిల్లా విద్యాధికారిగా నేరటి వరుణ్, ఎంపీడీవోగా మేడి గౌతమి, మండల విద్యాశాఖ అధికారిగా చెరుకు జ్ఞాపక, సర్పంచ్‌గా మెట్టు అవినాష్, ప్రధానోపాధ్యాయురాలిగా మారం అనుపమ, విద్యా కమిటీ చైర్మన్‌గా కొక్కుల భావన వ్యవహరించారు. ఆయా హోదాల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులు ఆకట్టుకున్నారు.

ముగింపు కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్ వైకాని ఉమ, ఏఏపీసీ చైర్మన్ బాబు జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు బాధ్యతాభావాన్ని అలవాటు చేస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News