Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారులకు ఆశీర్వాదం అందించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 09:45 PM

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి
April 26, 2026 07:31 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు, చెరువుల వద్ద ప్రమాదాలు, దొంగతనాలు పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాల దగ్గర చిన్న నిర్లక్ష్యం కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు పొలాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని, ఎండిన గడ్డి సమీపంలో మంటలు వేయకూడదని సూచించారు. వంటల అనంతరం పొయ్యిని పూర్తిగా ఆర్పకుండా బయటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే వేసవిలో ప్రజలు ఇళ్ల బయట, మేడలపై నిద్రించే సమయంలో దొంగతనాల ప్రమాదం ఉండటంతో ఇళ్ల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే నీటిలోకి వెళ్లాలని, లోతు తెలియని ప్రాంతాల్లో ఈతకు దిగకూడదని సూచించారు. మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం పూర్తిగా ప్రమాదకరమని హెచ్చరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే 100, 112 లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739కు సమాచారం అందించాలని తెలిపారు. గత వేసవిలో జిల్లాలో 7 అగ్ని ప్రమాదాలు, 50 దొంగతనాలు, 23 చెరువుల ప్రమాదాలు నమోదైనట్లు పేర్కొంటూ, అప్రమత్తతే ప్రాణ రక్షణకు మార్గమని ఎస్పీ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News