Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:11 AM

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి
26-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు, చెరువుల వద్ద ప్రమాదాలు, దొంగతనాలు పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాల దగ్గర చిన్న నిర్లక్ష్యం కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు పొలాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని, ఎండిన గడ్డి సమీపంలో మంటలు వేయకూడదని సూచించారు. వంటల అనంతరం పొయ్యిని పూర్తిగా ఆర్పకుండా బయటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే వేసవిలో ప్రజలు ఇళ్ల బయట, మేడలపై నిద్రించే సమయంలో దొంగతనాల ప్రమాదం ఉండటంతో ఇళ్ల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే నీటిలోకి వెళ్లాలని, లోతు తెలియని ప్రాంతాల్లో ఈతకు దిగకూడదని సూచించారు. మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం పూర్తిగా ప్రమాదకరమని హెచ్చరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే 100, 112 లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739కు సమాచారం అందించాలని తెలిపారు. గత వేసవిలో జిల్లాలో 7 అగ్ని ప్రమాదాలు, 50 దొంగతనాలు, 23 చెరువుల ప్రమాదాలు నమోదైనట్లు పేర్కొంటూ, అప్రమత్తతే ప్రాణ రక్షణకు మార్గమని ఎస్పీ తెలిపారు.

Sthanikam

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి

Article Image

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు, చెరువుల వద్ద ప్రమాదాలు, దొంగతనాలు పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాల దగ్గర చిన్న నిర్లక్ష్యం కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు పొలాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని, ఎండిన గడ్డి సమీపంలో మంటలు వేయకూడదని సూచించారు. వంటల అనంతరం పొయ్యిని పూర్తిగా ఆర్పకుండా బయటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే వేసవిలో ప్రజలు ఇళ్ల బయట, మేడలపై నిద్రించే సమయంలో దొంగతనాల ప్రమాదం ఉండటంతో ఇళ్ల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే నీటిలోకి వెళ్లాలని, లోతు తెలియని ప్రాంతాల్లో ఈతకు దిగకూడదని సూచించారు. మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం పూర్తిగా ప్రమాదకరమని హెచ్చరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే 100, 112 లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739కు సమాచారం అందించాలని తెలిపారు. గత వేసవిలో జిల్లాలో 7 అగ్ని ప్రమాదాలు, 50 దొంగతనాలు, 23 చెరువుల ప్రమాదాలు నమోదైనట్లు పేర్కొంటూ, అప్రమత్తతే ప్రాణ రక్షణకు మార్గమని ఎస్పీ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News