PRINT TIME: February 27, 2026 10:41 PM
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మనూరు లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మనూరు లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ
February 27, 2026 09:19 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ మానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,సీనియర్ ఉపాధ్యాయులు,భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు పెట్టి, జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.విద్యార్థులకు నిత్య జీవితంలో శాస్త్రం, విజ్ఞానం ప్రాముఖ్యతను గుర్తు చేయడం ముఖ్య ఉద్దేశ్యం.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం క్విజ్,వ్యాసరచన,చిత్రలేఖనం,ఉపన్యాస పోటీలను నిర్వహించారు.గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను సి.వి. రామన్ ఆదర్శాన్ని అనుసరించి శాస్త్రవేత్తలుగా, విజ్ఞానంలో ముందుకు పోవాలని, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలని ప్రోత్సహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి