Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:00 AM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చినకాపర్తిలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చినకాపర్తిలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చినకాపర్తిలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ
February 28, 2026 07:30 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చినకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చినకాపర్తి లో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల బాధ్యతలు, పరిపాలనా వ్యవస్థ, ప్రజాప్రతినిధుల విధులు వంటి అంశాలను స్వయంగా అనుభవిస్తూ అవగాహన పెంపొందించుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సైదా నాయక్ మాట్లాడుతూ, స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయుల కృషి, క్రమశిక్షణ ప్రాముఖ్యత, పరిపాలనా బాధ్యతల గౌరవాన్ని తెలుసుకుంటారని తెలిపారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అభ్యసించాలని సూచించారు.

ఈ వేడుకలో విద్యార్థులు వివిధ హోదాల్లో వేషధారణలు ధరించి ఆకట్టుకున్నారు. పాఠశాల హెడ్మాస్టర్‌గా అలేఖ్య, ముఖ్యమంత్రిగా నితీష్, గవర్నర్‌గా దీపక్ రెడ్డి, హోం మినిస్టర్‌గా శివ సాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా శ్రీవిద్య, ఫైనాన్స్ మినిస్టర్‌గా వైష్ణవి, ఎమ్మెల్యేలుగా నిహారిక, రేణుక, రేణుకాచారి, ఎంపీగా తేజస్విని, జెడ్పీటీసీగా మహేష్, సర్పంచ్‌గా స్ఫూర్తి, ఎమ్మెల్సీగా రామ్ చరణ్, పీఈటీగా త్రినేత్ర, ఠాగూర్, కళ్యాణ్, గన్‌మెన్‌లుగా అనిల్ కుమార్, నాగరాజు, జగదీష్, డిప్యూటీ సీఎంగా లోహిత్, ఎంపీటీసీగా ప్రణవి, కలెక్టర్‌గా మిన్ను, ఆర్జేడీగా మిష తదితరులు తమ పాత్రలను సమర్థంగా పోషించారు. ఉపాధ్యాయులుగా ప్రత్యూష, మహాలక్ష్మి, నర్మద, వర్షిత, నందిని, అలేఖ్య, కృతిక్ష, విన్నీ, శివ, రేణుక, శివానంద్ మరియు మినిస్టర్లుగా సాయిచరణ్, మహేందర్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజూ ఉపాధ్యాయులు ఎదుర్కొనే అనుభవాలను విద్యార్థులు ఈ రోజు ప్రత్యక్షంగా గ్రహించారని, ఆ అనుభవంవారిలోబాధ్యతాభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు.

హెడ్మాస్టర్ వేషం ధరించిన అలేఖ్య మాట్లాడుతూ, పాఠశాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు ప్రత్యక్షంగా కనిపించాయని, హెడ్మాస్టర్ బాధ్యతలు సులభం కాదని, ఇకపై ఉపాధ్యాయుల సూచనలను గౌరవంతో పాటిస్తామని తెలిపింది.

ఈకార్యక్రమంలోఆంగ్లఉపాధ్యాయులు బాలకృష్ణ, ఫిజిక్స్ ఉపాధ్యాయులు నయీముద్దీన్, గణిత ఉపాధ్యాయులు అసరాపల్లి మరియు శ్రీమతి మాధవి, సోషల్ టీచర్ సాయిబాబా, తెలుగు ఉపాధ్యాయులు చంద్రశేఖర్, హిందీ ఉపాధ్యాయులు శ్రీమతి రేవతి, వాలంటీర్లు శ్రీలత, నవ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు,క్రమశిక్షణ,బాధ్యతాభావం పెంపొందించే దిశగా స్వపరిపాలన దినోత్సవం ఉత్తమ వేదికగా నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News