Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 03:04 PM

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్
March 01, 2026 01:38 PM 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట, సకాలంలో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రత్యేక సువర్ణావకాశం కల్పించింది. 2010–11 విద్యా సంవత్సరం నుంచి పాత విధానం (ఇయర్‌వైజ్) లేదా నూతన విధానం (సెమిస్టర్)లో డిగ్రీ చదివి వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేకపోయిన వారికి ఈ అవకాశం వర్తిస్తుందని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధికారులు తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ చదివి బ్యాక్‌లాగ్ పేపర్లు మిగిలిన విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకుని తమ డిగ్రీని పూర్తిచేసుకోవాలని కోరారు.

పరీక్ష ఫీజు చెల్లించేందుకు మార్చి 4 (04-03-2026)ను చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా కళాశాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News