భక్తిశ్రద్ధలతో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి నిర్వహణ
భక్తిశ్రద్ధలతో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి నిర్వహణ
Krishna
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాసవి మహా సంస్థాన్ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్, కలెక్టరేట్, పాత బస్టాండ్ మీదుగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా “జై వాసవి.. జై జై వాసవి” నినాదాలతో ప్రాంతం మార్మోగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. తరువాత అమ్మవారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్లో వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించారు. తహసీల్దార్ జైరాం నాయక్, కలెక్టరేట్ అధికారులు పాల్గొని వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఆర్యవైశ్య మహిళలు, సంఘం నాయకులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి