Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:52 PM

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సేవ – తూమ్నూర్ గ్రామ భక్తుల నుంచి ఆలయానికి రూ.65 వేల హుండీ బహుకరణ

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సేవ – తూమ్నూర్ గ్రామ భక్తుల నుంచి ఆలయానికి రూ.65 వేల హుండీ బహుకరణ

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సేవ – తూమ్నూర్ గ్రామ భక్తుల నుంచి ఆలయానికి రూ.65 వేల హుండీ బహుకరణ
March 08, 2026 09:21 PM 171 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం భక్తులకు విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ప్రతి ఆదివారం ఈ ఆలయానికి పరిసర గ్రామాల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.ఈ క్రమంలో ఆదివారం మానూర్ మండలంలోని తూమ్నూర్ గ్రామానికి చెందిన మంగలి నారాయణ, మంగలి యాదగిరి, మంగలి మహేష్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు తమ భక్తిని చాటుకుంటూ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయానికి సుమారు రూ.65,000 విలువైన హుండీని భక్తి పూర్వకంగా బహుకరించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు యువత యువకులు మంగలి నారాయణ, మంగలి యాదగిరి, మంగలి మహేష్‌ల సేవాభావాన్ని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి భక్తి మరియు సేవా కార్యక్రమాలు ఇతర భక్తులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.ఈ విధంగా భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించడం ద్వారా అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని గ్రామస్తులు కోరుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News