Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 01:22 AM

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సేవ – తూమ్నూర్ గ్రామ భక్తుల నుంచి ఆలయానికి రూ.65 వేల హుండీ బహుకరణ

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సేవ – తూమ్నూర్ గ్రామ భక్తుల నుంచి ఆలయానికి రూ.65 వేల హుండీ బహుకరణ

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సేవ – తూమ్నూర్ గ్రామ భక్తుల నుంచి ఆలయానికి రూ.65 వేల హుండీ బహుకరణ
March 08, 2026 09:21 PM 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం భక్తులకు విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ప్రతి ఆదివారం ఈ ఆలయానికి పరిసర గ్రామాల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.ఈ క్రమంలో ఆదివారం మానూర్ మండలంలోని తూమ్నూర్ గ్రామానికి చెందిన మంగలి నారాయణ, మంగలి యాదగిరి, మంగలి మహేష్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు తమ భక్తిని చాటుకుంటూ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయానికి సుమారు రూ.65,000 విలువైన హుండీని భక్తి పూర్వకంగా బహుకరించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు యువత యువకులు మంగలి నారాయణ, మంగలి యాదగిరి, మంగలి మహేష్‌ల సేవాభావాన్ని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి భక్తి మరియు సేవా కార్యక్రమాలు ఇతర భక్తులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.ఈ విధంగా భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించడం ద్వారా అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని గ్రామస్తులు కోరుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News