దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు
దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఏడు గురువారాలు ఏడు ఆదివారాలు మహోత్సవం జరగబోయే సందర్భంగా ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గుడిని ఆకర్షణీయంగా అలంకరించేందుకు సీరియల్ లైట్స్, కలర్ లైట్స్ మరియు లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దాతలు అందించిన విరాళాలతో శనివారం ఆలయ కమిటీ హైదరాబాద్కు వెళ్లి అవసరమైన లైటింగ్ సామగ్రిని కొనుగోలు చేసి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి, ఆలయ చైర్మన్ మల్లయ్య, సిబ్బంది శేఖర్తో పాటు భక్తులు గొల్లపాపని నర్సింలు, గుడిమే హన్మంతు హైదరాబాద్కు వెళ్లారు. జాతర వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయని, భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు కమిటీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక భక్తులు కూడా జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి