Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:35 PM

దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు
April 11, 2026 08:48 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఏడు గురువారాలు ఏడు ఆదివారాలు మహోత్సవం జరగబోయే సందర్భంగా ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గుడిని ఆకర్షణీయంగా అలంకరించేందుకు సీరియల్ లైట్స్, కలర్ లైట్స్ మరియు లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దాతలు అందించిన విరాళాలతో శనివారం ఆలయ కమిటీ హైదరాబాద్‌కు వెళ్లి అవసరమైన లైటింగ్ సామగ్రిని కొనుగోలు చేసి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి, ఆలయ చైర్మన్ మల్లయ్య, సిబ్బంది శేఖర్‌తో పాటు భక్తులు గొల్లపాపని నర్సింలు, గుడిమే హన్మంతు హైదరాబాద్‌కు వెళ్లారు. జాతర వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయని, భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు కమిటీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక భక్తులు కూడా జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News