Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:09 PM

దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు
April 11, 2026 08:48 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఏడు గురువారాలు ఏడు ఆదివారాలు మహోత్సవం జరగబోయే సందర్భంగా ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గుడిని ఆకర్షణీయంగా అలంకరించేందుకు సీరియల్ లైట్స్, కలర్ లైట్స్ మరియు లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దాతలు అందించిన విరాళాలతో శనివారం ఆలయ కమిటీ హైదరాబాద్‌కు వెళ్లి అవసరమైన లైటింగ్ సామగ్రిని కొనుగోలు చేసి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి, ఆలయ చైర్మన్ మల్లయ్య, సిబ్బంది శేఖర్‌తో పాటు భక్తులు గొల్లపాపని నర్సింలు, గుడిమే హన్మంతు హైదరాబాద్‌కు వెళ్లారు. జాతర వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయని, భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు కమిటీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక భక్తులు కూడా జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News