Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరెగూడెంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:47 AM

దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్

దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్

దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్
March 06, 2026 12:19 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేందుకు, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో కీలకమని జడ్.పి.హెచ్.ఎస్ నారాయణఖేడ్ ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్ తెలిపారు.సమాజంలో ఉన్న దాతలు,పూర్వ విద్యార్థులు మరియు సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందించడం నిజంగా అభినందనీయమని ఆయన అన్నారు.శుక్రవారం నాడు చంద్రశేఖర్ ఆచార్య మిత్రులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సహకారంతో సుమారు రూ.10,000 విలువ గల ఇన్సులేటర్ పరికరాన్ని పాఠశాలకు అందజేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో దాతల సహకారంతో పాఠశాలలో చదువుతున్న సుమారు 900 మంది విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, విద్యా సామాగ్రి, ఆంగ్ల నిఘంటువులు, క్రీడా సామగ్రి, క్రీడా దుస్తులు వంటి అనేక అవసరమైన సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ పథకం ద్వారా విద్యార్థులకు వివిధ ప్రాంతాలకు విజ్ఞాన విహారయాత్రలు నిర్వహించడం ద్వారా వారికి ప్రాయోగిక జ్ఞానం అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల విజ్ఞానం మరియు అవగాహన పెంపొందించేందుకు పరిశ్రమలు, సంస్థలను సందర్శించే ఇండస్ట్రియల్ విజిట్లను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విద్యార్థులు హైదరాబాద్ నగరంలో ఉన్న అనూస్ బ్యూటిషియన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు భవిష్యత్తు అవకాశాలపై అవగాహన పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్, దన్సింగ్, చరణ్ సింగ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News