Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 06:00 PM

దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
March 02, 2026 04:19 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 62 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 37,గ్రామీణాభివృద్ధి శాఖ 7,మున్సిపాలిటీ 5,హౌసింగ్ 4,ఎం.పి.డి.ఓ 2,పంచాయతీ 2,జిల్లా పరిషత్,ఎలక్ట్రిసిట్,అటవీ శాఖ,విద్య శాఖ,ఆర్.టి.సి,శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. స్టేట్ ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ,జెడ్పీ సి.ఈ.ఓ శోభ రాణి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News