యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దోతి గూడెం వద్ద గల బృందావన్ ల్యాబ్ లో భారీ పేలుడు సంభవించింది.
ల్యాబ్లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భయాందోళన నెలకొంది. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తంగా బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
పేలుడు తీవ్రతతో ఒక బ్లాక్ పూర్తిగా దగ్ధమైంది. కంపెనీ ప్రాంగణంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రెవిన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి