Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 11:17 PM

చిత్తపూరు–బూరుగుగూడెం ప్రధాన రహదారికి నూతన రూపు

చిత్తపూరు–బూరుగుగూడెం ప్రధాన రహదారికి నూతన రూపు

చిత్తపూరు–బూరుగుగూడెం ప్రధాన రహదారికి నూతన రూపు
March 01, 2026 09:58 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఎన్నో సంవత్సరాలుగా అధ్వానంగా మారి అభివృద్ధికి నోచుకోని చిత్తపూరు నుంచి బూరుగుగూడెం వరకు ఉన్న ప్రధాన రహదారికి శాశ్వత పరిష్కారం లభించిందని, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సహకారంతో రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణం పూర్తి చేయబడుతుందని,

ప్రతిరోజూ భారీగా ప్రజల రాకపోకలు సాగుతున్న ఈ రహదారి గతంలో గుంతలతో నిండిపోవడంతో పాటు దుమ్ము, వర్షాకాలంలో మురికి నీరు నిల్వతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు ప్రయాణంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని,

ప్రజల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయించిందని, దీంతో చాట్రాయి గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన, భద్రమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చిందని

ఆరుగొలనుపేట జనార్ధవరం గ్రామం నుంచి బూరుగుగూడెం వరకు అభివృద్ధి దిశగా ఇది ఒక ముఖ్యమైన ఘట్టమని, మండలానికి ఇది ముందడుగని, దగ్గర వుండి పనులను పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నట్లు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు తెలిపారు.

రహదారి నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య, వ్యవసాయ కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News