Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 02:31 PM

చిట్యాలలో మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

చిట్యాలలో మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

చిట్యాలలో మాదిగ అమరవీరులకు ఘన నివాళులు
March 01, 2026 08:26 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు.ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమాల్లో ప్రాణత్యాగం చేసిన పొన్నాల సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ మరియు దర్శనాల భారతి మాదిగలను నేతలు స్మరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జరిగిన ఆందోళనల్లో గాయపడి మరణించిన వారి త్యాగాలు ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో సాగిన పోరాటాలను నేతలు ప్రస్తావించారు. అలాగే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Y. S. రాజశేఖర రెడ్డి హయాంలో వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమాలను గుర్తుచేశారు.మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) రాష్ట్ర నాయకుడు మేడి శంకర్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్ మాదిగ మాట్లాడుతూ — ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలవుతుండటం అనేకమంది మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమని తెలిపారు. ఎస్సీలకు కొనసాగుతున్న 15 శాతం రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం పెంచి అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాదిగ ఉపకులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు నోముల పురుషోత్తం మాదిగ, జిల్లా కార్యదర్శి పెరిక లింగస్వామి మాదిగ, టౌన్ కన్వీనర్ జోగు ప్రవీణ్ మాదిగతో పాటు పలువురు ఉద్యమ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సామాజిక న్యాయం సాధనలో అమరవీరుల త్యాగాలు మార్గదర్శకమని, వారి ఆశయ సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని నాయకులు సంకల్పం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News