Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 07:52 PM

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన సమస్యల పరిష్కారానికి హామీ

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన సమస్యల పరిష్కారానికి హామీ

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన  సమస్యల పరిష్కారానికి హామీ
February 28, 2026 06:11 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో శనివారం మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ స్థానిక సమస్యలను వివరించారు.

వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రహదారుల దుస్థితి, వీధి దీపాల సమస్యలు, తాగునీటి సరఫరా అంతరాయాలు వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను కూడా చైర్మన్, వైస్ చైర్మన్ స్వయంగా వినిపించుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ, వార్డులో ఉన్న ప్రాధాన్య సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన నిధులను మంజూరు చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు కూడా ప్రజలకు భరోసా ఇచ్చి, అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఎర్పుల పరమేష్, బొబ్బలి సందీప రాంరెడ్డి, నాయకులు గాలి లింగయ్య, దేశాపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News