Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:51 AM

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన సమస్యల పరిష్కారానికి హామీ

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన సమస్యల పరిష్కారానికి హామీ

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన  సమస్యల పరిష్కారానికి హామీ
28-02-2026 223 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో శనివారం మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ స్థానిక సమస్యలను వివరించారు.

వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రహదారుల దుస్థితి, వీధి దీపాల సమస్యలు, తాగునీటి సరఫరా అంతరాయాలు వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను కూడా చైర్మన్, వైస్ చైర్మన్ స్వయంగా వినిపించుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ, వార్డులో ఉన్న ప్రాధాన్య సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన నిధులను మంజూరు చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు కూడా ప్రజలకు భరోసా ఇచ్చి, అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఎర్పుల పరమేష్, బొబ్బలి సందీప రాంరెడ్డి, నాయకులు గాలి లింగయ్య, దేశాపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన సమస్యల పరిష్కారానికి హామీ

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో శనివారం మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ స్థానిక సమస్యలను వివరించారు.

వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రహదారుల దుస్థితి, వీధి దీపాల సమస్యలు, తాగునీటి సరఫరా అంతరాయాలు వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను కూడా చైర్మన్, వైస్ చైర్మన్ స్వయంగా వినిపించుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ, వార్డులో ఉన్న ప్రాధాన్య సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన నిధులను మంజూరు చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు కూడా ప్రజలకు భరోసా ఇచ్చి, అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఎర్పుల పరమేష్, బొబ్బలి సందీప రాంరెడ్డి, నాయకులు గాలి లింగయ్య, దేశాపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News