చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్కు ఘన సన్మానం
చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్కు ఘన సన్మానం
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్, వైస్ చైర్మన్లకు ప్రతిపక్ష నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మిలను మర్యాదపూర్వకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకురాలు, రెండో వార్డ్ కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ మరియు పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలతోఅభినందించారు. పట్టణ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, చిట్యాల పట్టణంలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందే నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కోరారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో కొనసాగింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి