Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 05:32 PM

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం
March 03, 2026 01:38 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ప్రతిపక్ష నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మిలను మర్యాదపూర్వకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకురాలు, రెండో వార్డ్ కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ మరియు పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్‌లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలతోఅభినందించారు. పట్టణ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, చిట్యాల పట్టణంలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందే నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కోరారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News