Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 10:00 AM

చిట్యాల మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యను సన్మానించిన బోడ విజయకుమార్

చిట్యాల మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యను సన్మానించిన బోడ విజయకుమార్

చిట్యాల మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యను సన్మానించిన బోడ విజయకుమార్
March 01, 2026 07:40 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు అభివృద్ధి దిశగా కృషి చేయాలనే సంకల్పంతో తొలిసారిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన గాలి యాదమ్మ లింగయ్యను సామాజిక కార్యకర్త బోడ విజయకుమార్ ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రజల సమస్యలను చట్టపరంగా, పరిపాలనాపరంగాపరిష్కరించాలనే ధ్యేయంతో ప్రజాసేవలోకి వచ్చిన గాలి యాదమ్మ లింగయ్య నిర్ణయాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.వార్డు అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు, కాల్వలు, రహదారులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు గాలి యాదమ్మ లింగయ్య తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని వార్డు ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమనిపేర్కొన్నారు.సన్మాన కార్యక్రమంలో రాకేష్, దినేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ, స్థానిక రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News