Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 10:25 PM

చిట్యాల మండలంలో నలుగురు విద్యార్థులకు జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్

చిట్యాల మండలంలో నలుగురు విద్యార్థులకు జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్

చిట్యాల మండలంలో నలుగురు విద్యార్థులకు జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్
February 27, 2026 08:37 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విద్యా రంగానికి గర్వకారణమైన విజయ ఘట్టం నమోదైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ మేఅంస్ కమ్మె రిట్స్కా లర్షిప్ స్కీం (NMMS) పరీక్షలో మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభ చాటుతూ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.గత సంవత్సరం నవంబర్‌లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో వనిపాకల, ఎలికట్టే గ్రామాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎలికట్టే గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పి. హారిక, ఎస్. కావ్య శ్రీలు మెరిట్ సాధించగా, వనిపాకల గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పి. సంజన, ఎం. సిరి కూడా స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.ఈ స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది గొప్ప ప్రోత్సాహంగా నిలుస్తోంది.

విద్యార్థుల విజయంపై వనిపాకల ప్రధానోపాధ్యాయులు శ్రీనయ్య చారి, ఎలికట్టేప్రధానోపాధ్యాయులు నరసింహ అభినందనలు తెలిపారు. క్రమశిక్షణతో చదువుతూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.అభినందన కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థులు చిట్యాల మండలానికి కీర్తి తెచ్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News