Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:16 PM

చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం వైభవంగా

చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం వైభవంగా

చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా  స్వపరిపాలన దినోత్సవం వైభవంగా
March 02, 2026 07:14 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు,బాధ్యతాభావాన్ని అలవరచేందుకు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

మండలంలోని ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉరుమడ్ల, ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వనిపాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులను నిర్వహించారు. పాఠ్యాంశాలను సమగ్రంగా బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాఠాలు బోధించడం విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. ఈ రోజు చేపట్టిన పదవులను భవిష్యత్తులో నిజ జీవితంలోనూ అలంకరించేలా శ్రమించాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని వివరించారు.కార్యక్రమంలో ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్ధన్, ప్రధానోపాధ్యాయులు ఆర్. వెంకన్న, ఏపూర్ జడ్‌పి హెచ్‌ఎస్ హెచ్‌ఎం పాలెం పరమేష్, ఉరుమడ్ల జడ్‌పి హెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు బోధనం మోహన్ రెడ్డి, వనిపాకల జడ్‌పి హెచ్‌ఎస్ హెచ్‌ఎం శ్రీను ఆచారి, దంతూరి సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News