చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం వైభవంగా
చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం వైభవంగా
Komidala Mahender reddy
చిట్యాల మండలం పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు,బాధ్యతాభావాన్ని అలవరచేందుకు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
మండలంలోని ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉరుమడ్ల, ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వనిపాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులను నిర్వహించారు. పాఠ్యాంశాలను సమగ్రంగా బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాఠాలు బోధించడం విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. ఈ రోజు చేపట్టిన పదవులను భవిష్యత్తులో నిజ జీవితంలోనూ అలంకరించేలా శ్రమించాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని వివరించారు.కార్యక్రమంలో ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్ధన్, ప్రధానోపాధ్యాయులు ఆర్. వెంకన్న, ఏపూర్ జడ్పి హెచ్ఎస్ హెచ్ఎం పాలెం పరమేష్, ఉరుమడ్ల జడ్పి హెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు బోధనం మోహన్ రెడ్డి, వనిపాకల జడ్పి హెచ్ఎస్ హెచ్ఎం శ్రీను ఆచారి, దంతూరి సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి