Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 05:16 PM

చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం వైభవంగా

చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం వైభవంగా

చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా  స్వపరిపాలన దినోత్సవం వైభవంగా
March 02, 2026 07:14 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు,బాధ్యతాభావాన్ని అలవరచేందుకు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

మండలంలోని ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉరుమడ్ల, ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వనిపాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులను నిర్వహించారు. పాఠ్యాంశాలను సమగ్రంగా బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాఠాలు బోధించడం విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. ఈ రోజు చేపట్టిన పదవులను భవిష్యత్తులో నిజ జీవితంలోనూ అలంకరించేలా శ్రమించాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని వివరించారు.కార్యక్రమంలో ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్ధన్, ప్రధానోపాధ్యాయులు ఆర్. వెంకన్న, ఏపూర్ జడ్‌పి హెచ్‌ఎస్ హెచ్‌ఎం పాలెం పరమేష్, ఉరుమడ్ల జడ్‌పి హెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు బోధనం మోహన్ రెడ్డి, వనిపాకల జడ్‌పి హెచ్‌ఎస్ హెచ్‌ఎం శ్రీను ఆచారి, దంతూరి సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News