చిట్యాల 9వ వార్డులోత్రాగునీటి సమస్యకు చెక్
చిట్యాల 9వ వార్డులోత్రాగునీటి సమస్యకు చెక్
Komidala Mahender reddy
వెంకటేశ్వర హిల్ కాలనీ వాటర్ ప్లాంట్ మరమ్మత్తులతో మళ్లీ ప్రజలకు సేవలు
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు వెంకటేశ్వర హిల్ కాలనీలో నెలలుగా నిలిచిపోయిన వాటర్ ప్లాంట్కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ప్లాంట్ పనితీరు దెబ్బతినడంతో కాలనీ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చింది.
ఈ కార్యక్రమంలో పందిరి గీతా రమేష్ ప్రత్యేకంగా చొరవ చూపి అధికారులతో సమన్వయం చేసి పనులను వేగవంతం చేశారు. అలాగే 9వ వార్డు కౌన్సిలర్ ఎర్పుల పరమేష్ స్థానికంగా పర్యవేక్షణ చేస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయించడంలో కీలక పాత్ర పోషించారు.సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాటి మాధవరెడ్డి కూడా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. వారి సమిష్టి కృషితో ప్లాంట్ మరమ్మత్తులు పూర్తి కావడంతో కాలనీ ప్రజలు ఉపశమనం పొందారు.
కాలనీ వాసులు ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలపై త్వరితగతిన స్పందించాలని కోరుతున్నారు. నీటి సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగేందుకు మున్సిపల్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి